Monday, 16 March 2026
Swasthik News
Home / రాజకీయం

"రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి : ఎరిక్షన్ బాబు

15 Mar 2026
10:21 PM
1,091

స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులతో ప్రత్యక్ష అనుసంధానం ఏర్పరచుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమం ఈ నెల 16, 17, 18 మరియు 23, 24, 25 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమలు చేయనున్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను వారికి మరింత చేరువ చేయడం, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సూచనలు సేకరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.

Article Image

ఈ నేపథ్యంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రతి రైతు వద్దకు చేరుకొని వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని ఆయన సూచించారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!