IND vs NZ :- రాయపూర్ లోని షాహిద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం వేదికగా భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి రెండవ T20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లకు 208 పరుగులు చేసింది. ఇందులో న్యూజిలాండ్ జట్టు తరఫున మిచెల్ శాంట్నర్ 47, రచన రవీంద్ర 44 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లందరూ కూడా 20 పరుగుల లోపే అవుట్ అయ్యారు. ఇక 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మొదట తడబడిన ఆ తరువాత ఇషాన్ కిషన్ మరియు సూర్య కుమార్ యాదవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ లకు మరో 30 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. 15.2 ఓవర్లకే 209 పురుగుల లక్ష్యాన్ని చేదించి రికార్డు సృష్టించింది. కిషన్ కిషన్ 76, సూర్య కుమార్ యాదవ్ 82 పరుగులు చేయడంతో భారత్ విజయానికి సులువుగా మారింది. అయితే మొదటి టీ20లో షేక్ చేసినటువంటి అభిషేక్ శర్మ ఈసారి డక్ ఔట్ అయ్యారు. రెండు టీ20 మ్యాచ్ లు గెలిచి భారత్ t20 సిరీస్ ను కైవసం చేసుకుంది.
