స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్:-
అమరావతి:-భారత అణు విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) హర్షం వ్యక్తం చేశారు. దేశ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాం విజయవంతం కావడం పట్ల ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. భారత రెండో దశ అణు కార్యక్రమం విజయవంతం కావడం దేశ అణు విద్యుత్ రంగంలో ఒక కీలక మైలురాయి అని సీఎం అభివర్ణించారు.మూడో దశకు మార్గం సుగమం: ఈ విజయంతో అణు కార్యక్రమం మూడో దశకు చేరుకోవడానికి మార్గం సుగమం అయిందని ఆయన పేర్కొన్నారు.ఇంధన భద్రత: భవిష్యత్తులో మన దేశంలో పుష్కలంగా ఉన్న థోరియం నిల్వలను వినియోగించుకుంటూ, ఇంధన భద్రతను సాధించేందుకు ఈ విజయం ఎంతో కీలకం కానుందని ఆయన తెలిపారు.ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం" అని కొనియాడుతూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.భారతదేశం తన సొంత సాంకేతికతతో అణు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా వేస్తున్న ఈ అడుగులను ముఖ్యమంత్రి అభినందించారు.