Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / జాతీయ వార్తలు

​బెంగాల్‌లో గెలిచాక.. ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

24 Apr 2026
12:53 PM
28

స్వస్తిక్ న్యూస్, నేషనల్ :- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ (BJP) లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బెంగాల్‌లో విజయం సాధించిన తర్వాత, ఢిల్లీలో కూడా బీజేపీని గద్దె దించుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.​ముఖ్యమంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు.​అధికారులపై నిఘా: బీజేపీ కోసం పనిచేస్తున్న వారి పేర్లను తాము నోట్ చేసుకున్నామని మమత పేర్కొన్నారు. బీజేపీ నేపథ్యం ఉన్న వ్యక్తులను కీలక అధికారులుగా నియమించారని ఆమె ఆరోపించారు.పోరాటమే మా మార్గం మమ్మల్ని ఓడించే సత్తా మీకు లేదు. మేము మా హక్కుల కోసం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని ఆమె స్పష్టం చేశారు.​లక్ష్యం ఢిల్లీ పీఠం బెంగాల్‌లో గెలిచిన తర్వాత తమ తదుపరి లక్ష్యం ఢిల్లీని టేకోవర్ చేయడమేనని ఆమె ప్రకటించారు.పవర్ ముఖ్యం కాదు తనకు వ్యక్తిగతంగా అధికారం అవసరం లేదని, అయితే బీజేపీ పతనం కావడమే తన ప్రధాన లక్ష్యమని మమత అన్నారు. బెంగాల్‌లో వారిని ఓడించి, ఢిల్లీలోనూ గద్దె నుంచి దించాలని ఆమె పిలుపునిచ్చారు.

​వచ్చే ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలు ఈ వ్యాఖ్యలతో మరింత వేడెక్కాయి. కేంద్రంపై మమత చేస్తున్న ఈ ధర్మయుద్ధం జాతీయ స్థాయిలో ఏ తీరాలకు చేరుతుందో వేచి చూడాలి.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates