స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ప్రారంభమైంది. అయితే, ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లిస్తేనే దరఖాస్తులను తీసుకుంటామని కొన్నిచోట్ల అధికారులు చెబుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, ఈ నెలలో మాత్రమే పోస్టాఫీస్ ద్వారా పెన్షన్ వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఆధార్తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెన్షన్ నగదు జమ చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు వారంలోగా తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు సమర్పించాలని సూచిస్తున్నారు.