Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

చెన్నైకి భారంగా మారిన కెప్టెన్.. ఎందుకంటే?

06 Apr 2026
06:48 AM
115

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ ఇప్పుడు ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనర్‌గా జట్టుకు మంచి పునాది వేయాల్సిన గైక్వాడ్, వరుసగా బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి..?​ భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో గైక్వాడ్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది.  180 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గత 12 మ్యాచ్‌ల్లో ఆయన కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఏకంగా 9 సార్లు రెండంకెల స్కోరు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు. నిన్నటి రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో, భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.

Article Image

​బ్యాటింగ్‌లోనే కాకుండా, కెప్టెన్‌గా కూడా రుతురాజ్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నారనే వాదన వినిపిస్తోంది. కీలక సమయాల్లో బౌలింగ్ మార్పులు మరియు ఫీల్డ్ సెటప్‌లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు జట్టుకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.​మొత్తానికి, అటు ఆటగాడిగా.. ఇటు కెప్టెన్‌గా గైక్వాడ్ చెన్నై జట్టుకు భారంగా మారారంటూ క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates