స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ 2026 విజేత టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించిన భారత్..వరుసగా రెండోసారి టీ20 వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన భారత్. మొత్తం మూడు సార్లు టీ20 వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఈసారి టి20 వరల్డ్ కప్ గెలిచినందుకుగాను బీసీసీఐ టీమిండియా జట్టుకు ఏకంగా 131 కోట్ల రూపాయలను బహుమతిగా ప్రకటించింది. ఈ భారీ నజరానా ప్రకటించడం పట్ల యావత్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అందరూ బీసీసీఐపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
