Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

"ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన"ను ఘనంగా ప్రారంభించిన ఎరిక్షన్ బాబు

17 Feb 2026
12:56 PM
310

స్వస్తిక్ న్యూస్, త్రిపురాంతకం :- యర్రగొండపాలెం నియోజకవర్గం, త్రిపురాంతకం లో ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి మరియు బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆశీస్సులతో  "ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన"  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ "గూడూరి ఎరిక్షన్ బాబు"  పాల్గొని ఎడ్ల పందాలను ఘనంగా ప్రారంభించారు.

Article Image

ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ.. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయ క్రీడలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రైతుల గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల శక్తి, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికలుగా ఇటువంటి కార్యక్రమాలు నిలుస్తాయని అన్నారు.

Article Image

ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండలం టీడీపీ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, మరియు ఎడ్ల పందాలు నిర్వహణ కమిటీ సభ్యులతో పాటుు భారీ ఎత్తున మార్కాపురం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి మరి వీక్షిస్తున్నారు. 

Article Image

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!