Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

ఆ గూడెంలో "రవి" కిరణాలు

07 Feb 2026
03:56 PM
103

పుల్లలచెరువు, యర్రగొండపాలెం:-       యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పాలుట్ల గిరిజన గూడెంలో "రవి" కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆధునిక సాంకేతికత విస్తృతంగా నేడు అందుబాటులోకి వచ్చినా నేటికి ఆ గూడెంలో విద్యుత్ సౌకర్యం లేదు. రాత్రివేళల్లో చిమ్మ చీకట్లలోనే నివాసం ఉంటూ బ్రతుకు వెళ్ళదీస్తున్న పరిస్థితి. సరైన రహదారీ లేదు. అంతటి దీన గాధ వారిది.

Article Image

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి రవి కుమార్ సమస్యను సీఎం దృష్టిలో తీసుకెళ్లి 611 కుటుంబాలకు 2.86 కోట్ల నిధులను మంజూరు చేయించి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయించారు. దీంతో గూడెం వాసులు ఆ సోలార్ వెలుగులను 'రవి 'కిరణాలుగా చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇంచార్జి ఎరిక్షన్ బాబు చొరవతో తమ గూడెంలో రాత్రి పూట వెలుతురు చూస్తున్నామంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. 

Article Image

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!