Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక: ఏప్రిల్ 8 నుంచే SA-2 పరీక్షలు

03 Apr 2026
11:41 AM
117

స్వస్తిక్ న్యూస్,తెలంగాణ:-  రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA-2) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా మార్పుల ప్రకారం, ఏప్రిల్ 10కి బదులుగా రెండు రోజులు ముందుగానే, అంటే ఏప్రిల్ 8వ తేదీ నుంచే విద్యార్థులకు SA-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

తరగతుల వారీగా పరీక్షల సమయాలు ఇలా ఉన్నాయి...

  1. 1 నుంచి 7వ తరగతుల విద్యార్థులకు:-  ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు.
  2. 8వ తరగతి విద్యార్థులకు:- ఉదయం 9:00 గంటల నుంచి 11:45 గంటల వరకు.
  3. 9వ తరగతి విద్యార్థులకు:- ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
  4. పేరెంట్స్ మీటింగ్ మరియు సెలవులు:- పరీక్షలు అన్నీ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 23వ తేదీన అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ (తల్లిదండ్రుల సమావేశం) నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఆ మరుసటి రోజు అనగా, ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates