స్వస్తిక్ న్యూస్,అమరావతి :- ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, రాబోయే రోజుల్లో మళ్లీ తామే అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన ఒక కీలక సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఐదేళ్ల వైకాపా పాలన వర్సెస్ రెండేళ్ల కూటమి పాలనసమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, గత ఐదేళ్ల తమ సంక్షేమ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు మధ్య తేడాను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో దాదాపు 99 శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు."గత ఎన్నికల్లో జగన్ను ఎందుకు వదులుకున్నామా అని ప్రజలు ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తున్నారు."— వైఎస్ జగన్ మోహన్ రెడ్డిమళ్లీ వచ్చేది మనమే!కూటమి ప్రభుత్వ కాలపరిమితిని ఉద్దేశిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆయన ధైర్యాన్ని నింపారు. "కళ్లు మూసుకుంటే ఈ రెండేళ్లు గడిచిపోతాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే" అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.