స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :-యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా దర్బార్" కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు.

ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేపు మహాశివరాత్రి సందర్భంలోనూ.. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఇక ఇప్పటికే మహాశివరాత్రి ఏర్పాట్లను పూర్తి చేసామని.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొండపైకి నూతన రహదారిని కూడా నిర్మించాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు ,మండల టీడీపీ కన్వీనర్ చిట్యాల వెంగళరెడ్డి , శనగ నారాయణరెడ్డి మండల టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.