స్వస్తిక్ న్యూస్, సినిమా :- నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘మైసా’ షూటింగ్ ప్రస్తుతం కేరళలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్లను చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో సుమారు 15 రోజుల పాటు భారీ యాక్షన్ షెడ్యూల్ను ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో, ప్రముఖ కొరియోగ్రాఫర్ కేచా ఖంఫక్డీ నేతృత్వంలో ఈ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ముఖ్య విశేషాలు:- ఈ సినిమాలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.ప్రస్తుతం విడుదలైన రష్మిక రౌద్ర రూపం చూస్తుంటే, ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. గిరిజన పోరాట యోధురాలిగా ఆమె నటన ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా