Monday, 16 March 2026
Swasthik News
Home / ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లాలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26 Jan 2026
10:25 PM
187

మార్కాపురం జిల్లా:-   మార్కాపురం పట్టణంలో SVKP కాలేజీ గ్రౌండ్ లో మొదటి సారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కాపురం జిల్లా అయిన తరువాత మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా యంత్రాంగా అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు మరియు విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా పార్లమెంట్ సభ్యులు  మాగుంట  శ్రీనివాసుల రెడ్డి, ప్రకాశం జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు & కనిగిరి ఎమ్మెల్యే  ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే  ముత్తమల  అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే  కందుల నారాయణ రెడ్డి కలిసి ఈ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన శఖటాలు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, కళాకారులకు శిల్డ్‌లు బహుకరించి ప్రోత్సహించారు.

Article Image

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!