Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

చెన్నై అభిమానులకు షాక్: మరికొన్ని మ్యాచ్‌లకు ధోనీ దూరం!

08 Apr 2026
01:06 PM
148

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:-

చెన్నై:- ఐపీఎల్-2026 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ముఖ్య అంశాలు:-  ప్రస్తుతం ధోనీ గాయం నుండి కోలుకోవడానికి రిహాబిలిటేషన్‌లో ఉన్నారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఆయనకు కనీసం మరో వారం రోజుల సమయం పట్టవచ్చని 'క్రిక్ బజ్' వెల్లడించగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని చెన్నైకి, ధోనీ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారింది.

తిరిగి వచ్చేది ఎప్పుడంటే?:- ధోనీ కోలుకున్న తర్వాత ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరగబోయే మ్యాచ్ నాటికి ఆయన జట్టులోకి అందుబాటులోకి వస్తారని CSK యాజమాన్యం ఆశిస్తోంది.

​వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై జట్టును, 'థాలా' ధోనీ తన రాకతో మళ్లీ విజయపథంలోకి నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates