Tuesday, 21 July 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

కెప్టెన్‌గా గెలవడం మరిచిపోయిన శ్రేయస్ అయ్యర్! వరుస ఓటములతో తీవ్ర నిరాశ

05 Jul 2026
07:24 AM
1,024

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :-  స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌ను ప్రస్తుత రోజుల్లో ఓటములు వెంటాడుతున్నాయి. కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించడంలో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించిన గత 11 మ్యాచ్‌లలో ఆయన జట్లు ఏకంగా 9 సార్లు ఓటమి పాలుకావడం గమనార్హం. ఇందులో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా, మరొక మ్యాచ్ రద్దయింది.​ఐపీఎల్ 2026లోనూ అదే పరిస్థితి..ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 (IPL 2026) లోనూ శ్రేయస్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, చివరి లీగ్ గేమ్‌లో మాత్రం ఎట్టకేలకు విజయం సాధించి కాస్త ఊరట పొందింది.భారత టీ20 కెప్టెన్‌గా నిరాశే..

​భారత టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా శ్రేయస్ అయ్యర్ ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. ఇక్కడ కూడా వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూడాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న శ్రేయస్ అయ్యర్ రాబోయే మ్యాచ్‌ల్లోనైనా కెప్టెన్‌గా తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కుతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates