స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- IPL 2026: ఐపీఎల్లో భాగంగా లక్నోతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 7 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
బ్యాటర్ల వీరవిహారం:- పంజాబ్ బ్యాటర్లు ఆరంభం నుండే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఇద్దరు బ్యాటర్లు మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.ప్రియాంక్ష్ ఆర్య కేవలం 37 బంతుల్లోనే 93 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యారు. ఇందులో 9 భారీ సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.కనోలి ఈయన కూడా తక్కువ తినలేదు. 46 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 87 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు.
రికార్డుల మోత :-ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లందరూ కలిసి ఏకంగా 21 సిక్సర్లు బాదడం గమనార్హం. పవర్ప్లే నుండి చివరి ఓవర్ వరకు బౌండరీల మోత మోగడంతో స్టేడియం మార్మోగిపోయింది. ఈ భారీ స్కోరుతో పంజాబ్ జట్టు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.