Monday, 16 March 2026
Swasthik News
Home / మార్కాపురం

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటాం : బొజ్జా వెంకటేశ్వర్లు

07 Feb 2026
11:55 AM
15

స్వస్తిక్ న్యూస్,పుల్లలచెరువు:- కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెలో పాల్గొంటున్నట్లు మండల సిఐటియు నాయకులు బొజ్జా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు పుల్లలచెరువులో పంచాయతీ కార్మికులు సచివాలయం-1 లో సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకే ఈ సమ్మె చేస్తున్నట్లుగా తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు .

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!