స్వస్తిక్ న్యూస్,పుల్లలచెరువు :- వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పుల్లలచెరువు మండల కన్వీనర్ దోమకాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుల్లలచెరువులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.అనంతరం వైసీపీ జెండా ఎగరవేసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అన్ని విభాగాల గ్రామ కమిటీల సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
