స్వస్తిక్ న్యూస్,పుల్లలచెరువు :- వైస్సార్సీపీ కార్యకర్తల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న యర్రగొండపాలెం శాసనసభ్యులు ,వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆదేశాలు మేరకు గ్రామస్థాయిలో వైస్సార్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయుటకు గ్రామ కమిటీల నియామక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుల్లల చెరువు మండలం పరిధిలోని రాచకొండ పంచాయతీ,రాచకొండ గ్రామం YSR విగ్రహ ఆవరణలో సాయంత్రం 6:00pm కు సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేయాలి అని పుల్లలచెరువు మండల అధ్యక్షులు దోమకాల వెంకటేశ్వర్లు కోరారు.
